#బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...
త్రికటు:
ఇది శరీరంలో ఏర్పడ్డ కఫం,కొలెస్ట్రాల్ అంటే అధిక బరువు, శ్వాస, కాస, చర్మరోగాలు, గొంతులోని సమస్యలు, వాపులు, ఉదరరోగ వంటి సమస్యలు నివారించడానికి వైద్యులు వాడుతుంటాము.
ఇందులో శుంఠి-అల్లం పొడి, పిప్పళ్లు, మిరియాలు సమపాళ్లలో పొడిగా చేస్తారు.ఇవి మూడు కూడా కటు రసం అంటే కారం వంటి రుచి ని కలిగి వుంటాయని దీనికి ఈ పేరు.
మూడు కూడా ఉష్ణ వీర్యం ని కలిగి ఉంటాయి అంటే మనం ఈ ఔషధం తింటే శరీరంలో వేడిని పుట్టిస్తుంది.
ఈ లక్షణం వల్లనే ఉబ్బసం, ఆస్తమా, దగ్గు, దమ్ము,ఊపిరితిత్తుల సమస్యలు, లావు,గర్భాశయ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం, PCOD, ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్ )వంటి కఫం-వాత సంబంధ సమస్యల్లో బాగా ఉపశమనం ఇస్తుంది.
అలాగే ఇందులోని శుంఠి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు అంటే అరుచి, అజీర్ణం, IBS లో సరిఅయిన అనుపానం, మోతాదుతో వాడితే ఉపశమనం ఇస్తుంది.
అలాగే ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ నుండి తట్టుకోవడానికి చాలావరకు మంచిది.
తినడానికి 20నిమిషాల ముందు 3gm త్రికటు చూర్ణం తేనెతో తీసుకోవాలి. రోజుకు 3సార్లు
దగ్గు ఉన్నవాళ్ళు 2gm పొడిని తేనెతో చప్పరించాలి రోజుకి 5సార్లు వాడవచ్చు.
ఒబెసిటీ పోవడం కొరకు 1 టీ స్పూన్ త్రికటు గోరువెచ్చటి నీటితో తీసుకోవాలి తినడానికి ముందు.
మజ్జిగ, గంజి, భోజనంలో ఇలా కూడా వాడవచ్చు.ఇందులో ఉండే రసాయనాలు రక్తంలో చక్కెరస్థాయిని తగ్గిస్తాయి అలాగే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగడానికి పాంక్రయాటిక్ సెల్స్ ను ఉతేజపరుస్తాయి.
శరీరంలో కఫం, చెడు కొలెస్టెరాల్ పెరగకుండా చూస్తుంది.
అయితే ఎసిడిటీ, పిత్త ప్రకృతి శరీరం గల వారు, పుల్లని వాంతులు అయ్యేవారిలో ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.
అనుపానం, మోతాదు అనేది వ్యక్తి యొక్క సమస్య, జఠరాగ్ని బలం, శరీరప్రకృతి వంటి లక్షణాలను చూసి నిర్ణయించడం జరుగుతుంది.
సర్వేజనా సుఖినోభవంతు...
DR.K.V.మాలతి BAMS
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్.


Nice one Dr.Malathi
రిప్లయితొలగించండిThanq Dr.
తొలగించండి